ఆంధ్ర ప్రదేశ్

Vijaysai Reddy: విరిగిన మనసు అతుక్కోదు..వైసీపీలో మళ్లీ చేరను

Vijaysai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు, జగన్‌కు మధ్య విభేదాలు సృష్టించారని విజయసాయిరెడ్డి తెలిపారు. కొందరు ఎదగడానికి తనను కిందకు లాగారని అన్నారు. కోటరీ నుంచి బయటపడితేనే జగన్‌కు భవిష్యత్తు ఉంటుందన్నారు. నాయకుడు చెప్పుడు మాటలు నమ్మకూడదని విజయసాయిరెడ్డి హితవు పలికారు. చెప్పుడు మాటలు నమ్మితే పార్టీకే నష్టమన్నారు. కోటరీ వల్లే జగన్‌కు నేను దూరమయ్యానని విజయసాయిరెడ్డి తెలిపారు.

జగన్ మనసులో స్థానం లేదు కాబట్టే పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. విరిగిన మనసు అతుక్కోదు వైసీపీలో మళ్లీ చేరనని తేల్చిచెప్పారు. కాకినాడ డీల్‌లో కర్త, కర్మ, క్రియ విక్రాంత్‌రెడ్డే అని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని సీఐడీకి చెప్పినట్లు తెలిపారు. కేవీ రావు అంటే నాకు అసహ్యమని తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి ఎప్పుడు అమెరికా వెళ్లినా కేవీ రావుకు ఇంట్లోనే ఉంటారని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button