జాతియం
Nitin Gadkari: ఇక బైక్ కొంటే రెండు హెల్మెట్స్.. కేంద్రం కీలక నిర్ణయం

Nitin Gadkari: బైక్ ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహన విక్రేతలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తించారు.
బైక్ వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ఇద్దరూ హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. దీంతో ద్విచక్ర వాహన విక్రేతలు నూతన బైక్ కొనుగోలు సమయంలోనే రెండు హెల్మెట్లను విక్రయించనున్నారు.