తెలంగాణ
రంగరాజన్పై దాడి కేసులో కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటివరకు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
రెండేళ్ల క్రితం కౌశలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఆర్మీ ఏర్పాటు చేసి 20 వేల జీతం, వసతి అంటూ ప్రకటనలు ఇచ్చారు. దీంతో వీర రాఘవరెడ్డి ఉచ్చులో అమాయకులు పడ్డారు. వారిని అడ్డుపెట్టుకొని దాడులకు పథక రచన చేశాడు వీర రాఘవరెడ్డి. మరోవైపు వీర రాఘవరెడ్డిని మోయినాబాద్ పోలీసులు కస్టడీకి కోరారు. దీనిపై రాజేంద్రనగర్ కోర్టు సోమవారం విచారించనుంది.