అంతర్జాతీయం

అబూ ఖతల్ ఖతం… అజ్ఞాతంలోకి హఫీజ్ సయీద్

పాకిస్తాన్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. లష్కరే తోయిబా లక్ష్యంగా ఏరివేత నడుస్తోంది. జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హఫీజ్ మేనల్లుడు హతమయ్యాడు. లష్కరే ఉగ్రవాది అబూ కతల్‌ను గుర్గుతెలియని దుండుగులు చంపేశారు. రాజా మునీబ్ అనే ఓ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జీలంలో కార్ప్స్ కమాండ్ మంగ్లాతో సమావేశమైన అనంతరం తిరిగి వస్తోండగా మార్గమధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని కారుపై కాల్పులు జరిపాడు.

ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. 26/11 ముంబై దాడులకు హఫీజ్ ప్రధాన సూత్రధారి. అలాగే పుల్వామా దాడికి కూడా హఫీజ్ సయీద్ ప్రధాన సూత్రధారి. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థపై… 10 మిలియన్ డాలర్ల బహుమతి ఉంది. ఉగ్రవాద నిధులకు సంబంధించిన కేసులో హఫీజ్ సయీద్‌ను జైలుకు తరలించారు. హఫీజ్ సయీద్ కాశ్మీర్‌లో ఉగ్రవాద గ్రూపులకు నిధులు సమకూరుస్తున్నాడు. అతడ్ని అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను అభ్యర్థించింది.

26/11 ముంబై మారణకాండ దేశ ఆర్థిక రాజధానిపై 2008లో చోటు చేసుకున్న ఉగ్రవాద దాడి.. ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసింది. తాజ్ హోటల్, ట్రైడెంట్ ఓబెరాయ్, ఛత్రపతి శివాజీ రైల్వే స్టేషన్, లెపార్డ్ కేఫ్, రెండు ఆసుపత్రులు, నారిమన్ హౌస్ వంటి ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులు జరిపారు. ఈ మారణహోమానికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. ముంబైపై దాడి చేయడానికి లష్కరే తొయిబాకు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చాడు హఫీజ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button