తెలంగాణ
మలక్పేట్ గంజ్ మార్కెట్ను ప్రారంభించిన కవిత

హైదరాబాద్ మలక్పేట్ గంజ్ మార్కెట్ను జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రారంభించారు. మార్కెట్లో హమాలీలు, డైలీ కూలీలు, వ్యాపారస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ మార్కెట్ను కాపాడుకోవాలని, మార్కెట్లో కనీస సౌకర్యాలు అత్యవసరమని అదేవిధంగా త్రాగు నీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను వెంటనే అభివృద్ధి చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆమె కోరారు. మార్కెట్లో ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ వంతు సహాయం కొనసాగుతుందని జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.



