తెలంగాణ
Harish Rao: యాప్లు, మ్యాప్లతో రైతులను ఆగం చేస్తున్నారు

Harish Rao: సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పామాయిల్ రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయాన్ని కేసీఆర్ అద్భుతంగా తీర్చిదిద్దారని కానీ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అంతా తలకిందులైందన్నారు. యాప్లు, మ్యాప్లతో రైతుల్ని రేవంత్ సర్కార్ ఆగం చేస్తోందని మండిపడ్డారు. యూరియా కోసం అన్నదాతలు అరిగొస పడుతున్నారన్నారు.



