తెలంగాణ

శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన

తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాట పట్టారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని ఇప్పుడు స్కూటీ లేదు, లూటీ ఉందంటూ ఆందోళన చేపట్టారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజమంటూ నిప్పులు చెరిగారు. విద్యార్థులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ స్కూటీ ఫ్లకార్డులు చేతపట్టి వినూత్న నిరసన తెలిపారు.

డిగ్రీ విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇవ్వని హామీలు సైతం కేసీఆర్ అమలు చేశారంటూ గుర్తుచేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక హామీలు అమలుచేయకపోతే ప్రజాగ్రహం తప్పదన్నారు. సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతోందంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button