ఆంధ్ర ప్రదేశ్
ఏపీ సెక్రెటేరియట్లో కాఫీ స్టాల్ ప్రారంభించిన అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో అరకు కాఫీ స్టాల్ను శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ,మంత్రులు పాల్గొన్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫొటో సెషన్ నిర్వహించారు. సీనియారిటీ ప్రకారం ఎమ్మెల్యేలు 2, 3, 4 వరుసల్లో కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్సీల ఫొటో సెషన్ జరిగింది.