ఆంధ్ర ప్రదేశ్
Palla Srinivasa Rao: వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో విశాఖలో కుంభకోణం

Palla Srinivasa Rao: ఏపీ అసెంబ్లీలో వైసీపీపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్యే పల్లా ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల పేరుతో విశాఖలో కుంభకోణం జరిగిందన్నారాయన.
60 కోట్లలో వైసీపీ ఆఫీస్కు 11 కోట్ల రూపాయలు వెళ్లాయని వెల్లడించారు పల్లా. అందులో విజయసాయిరెడ్డికి 20 కోట్లు అందాయన్నారు. రాజకీయనాయకులు, అధికారులు కుమ్మక్కై దోచుకున్నారని చెప్పుకొచ్చారు. ఓ బిల్డింగ్ విషయంలో 60కోట్లతో ఓ థర్డ్ పార్టీకి హక్కులు ఇచ్చారని పల్లా శ్రీనివాసరావు తెలిపారు.