తెలంగాణ
Secunderabad: దారుణం.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న యువకుడు

Secunderabad: సికింద్రాబాద్ లోని కామాక్షి సిల్క్స్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కోపంతో భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ప్యాట్నీలో ఉన్న కామాక్షి సిల్క్స్ షాప్ లోనే భర్త నిప్పు పెట్టుకున్నాడు. భార్య మౌనిక షాప్ లో పని చేస్తుండగా భర్త శ్రవణ్ గొడవ పడి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో .. గాంధీకి తరలించారు. దుకాణంలో వినియోగదారులు ఉండగానే ఘటన జరగడంతో అందరూ ఒక్కసారిగా పరుగులు తీశారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.