జాతియం
Bijapur: 18 మంది మావోయిస్టులు లొంగుబాటు

Bijapur: ఛత్తీస్ గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల ఎదుట మావోయిస్టులు భారీగా లొంగిపోయారు. పిఎల్జిఎ డిప్యూటీ కమాండర్ రాకేష్తో సహా.. మొత్తం 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్తులపై 87.5 లక్షల రివార్డు ఉన్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ తెలిపారు. పిఎల్జిఎ డిప్యూటీ కమాండర్ రాకేష్పై 10 లక్షల రివార్డు ఉన్నట్టు వెల్లడించారు.
అలాగే ములుగు జిల్లాలోనూ ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్తో 18 మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై 25 రూపాయలు రివార్డ్ అందించారు ఎస్పీ శబరీష్. మావోయిస్టులు స్వచ్ఛదంగా లొంగిపోతే సహకరిస్తామని వెల్లడించారు. కాలం చెల్లిన సిద్ధాంతాలను వదలి జనజీవన స్రవంతిలో కలవాలని.. మావోయిస్టులకు ములుగు ఎస్పీ శబరిష్ పిలుపునిచ్చారు.