తెలంగాణ

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా రఘునాథపల్లిలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులకు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. మొరిపిరాల గ్రామానికి చెందిన కటికె కృష్ణతో ఏడాది క్రితమే సంధ్యతో వివాహం జరిగింది. అయితే ఆరు నెలలుగా అత్తింటివారు వరకట్న వేధింపులు తాళలేక పెద్ద మనుషులను ఆశ్రయించింది.

పెద్దమనుషులు మాట్లాడినా భర్త, అత్త, మామల్లో మార్పు రాలేదు. దీంతో సంధ్య మనస్థాపానికి గురైన సంధ్య సూసైడ్ లెటర్ రాసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే సూసైడ్ లెటర్‌లో అత్తింటివారి పేర్లు, పలువరు పోలీసుల పేర్లు రాసినట్లు మృతురాలి తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button