తెలంగాణ
Jogu Ramanna: ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు పోరాటాలు చేస్తాం

Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో అనుమతి లేదంటూ పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని జోగు రామన్న మండిపడ్డారు.
420 హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. రుణమాఫీతో పాటు రైతు భరోసా హామీ రైతులందరికీ వర్తించేలా చేయాలన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు పోరాటాలు చేస్తామని జోగు రామన్న అన్నారు.