ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: బాత్రూమ్లో మహిళ దారుణ హత్య

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ బిల్డింగ్లోని బాత్రూమ్లో మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలు పొందూరు మండలం మొదలవలసకు చెందిన కళావతిగా పోలీసులు వెల్లడించారు. అయితే కళావతికి పరిచయమున్నవారి ఇంటి వద్ద.. కళావతి బైక్ను భర్త వెంకటరావు గుర్తించారు.
అనుమానంతో తాళాలు పగలగొట్టి చూడగా బాత్రూమ్లో విగతజీవిగా పడిఉండటంతో కన్నీరుమున్నీరయ్యాడు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించగా.. సంఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. అయితే కళావతిని గొంతు నులిమి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక కళావతి భర్త వెంకటరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కాగా.. ముగ్గురు పిల్లలు.