తెలంగాణ
ఒకే వేదికపై రేవంత్ రెడ్డి, కేటీఆర్.. ఆసక్తికర సన్నివేశం

చెన్నైలో జరగబోయే సౌత్ ఇండియా జేఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. పార్లమెంట్ నియోజకవర్గల పునర్విభజనలో దక్షిణ భారత రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆహ్వానించారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై కేటీఆర్, రేవంత్ రెడ్డి గళం విప్పనున్నారు. కాగా సీఎంతో పాటు మహేష్గౌడ్ చెన్నై వెళ్లనున్నారు.