ఆంధ్ర ప్రదేశ్
సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ

Chandrababu: సీఎం చంద్రబాబుతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అత్యవసర భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా ఢిల్లీ పరిణామాలను చంద్రబాబుకు వివరించిన ఎంపీ లావు. జగన్ జమానాలో మద్యం స్కామ్ జరిగిందని పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. 4వేల కోట్లు విదేశాలకు తరలించారంటూ ఆరోపణలు చేశారు ఎంపీ లావు.
కాగా నిన్న ఇదే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సైతం కలిశారు ఎంపీ. చెప్పాలంటే మద్యం కుంభకోణం వ్యవహారాన్ని కూటమి సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.