ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

Chandrababu: ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలంటూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలని కోరారు.
మిర్చి రైతుల పరిస్థితి, మార్కెట్లో ధరల పతనంపై ఈ నెల14 వ తేదీన ఢిల్లీలో జరిగిన సమావేశం వివరాలను లేఖలో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను కూడా సమర్పించిందని వివరించారు.