తెలంగాణ
ట్రిబుల్ ఆర్ టార్చర్ కేసులో తులసి బాబు అరెస్ట్

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పై కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రైవేటు వ్యక్తి కామేపల్లి తులసి బాబును అరెస్ట్ చేశారు. ఆరు గంటల పాటు కామేపల్లి తులసి బాబుని కేసు విచారణ అధికారి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు. రఘురామ కృష్ణంరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసి బాబు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఆయనతో రిమాండ్ లో ఉన్న రిటైర్డ్ ఏఎస్పీ విజయ్ పాల్ తో పాటు కలిపి తులసి బాబు ని విచారించారు ఎస్పీ దామోదర్. విచారణ అనంతరం తులసి బాబు ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.. వైద్య పరీక్షల అనంతరం ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరిచనున్నారు. . మరోవైపు త్రిపుల్ ఆర్ కస్టోడియల్ టార్చర్ సమయంలో తులసి బాబు గుండెల పై కుర్చోని టార్చర్ చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.