తెలంగాణ
ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు, పురుషులు

వికారాబాద్ జిల్లా ఆర్టీసీ బస్సులో సీట్ల కోసం కోట్లాడుకున్నారు. సీటు కోసం మహిళలు, పురుషులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటన పరిగి నుంచి వికారాబాద్ రూట్లో చోటు చేసుకుంది. ఈ రూట్లో తక్కువ బస్సులు ఉండటంతో సీటు కోసం జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరిగి-వికారాబాద్ రూట్లో బస్సుల సంఖ్యను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.