ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: సింహాచలం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు

Chandrababu: సింహాచలం ఘటనపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మృతుల కుటుంబాలకు 25లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయంపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు చంద్రబాబు ఆదేశించారు.