జాతియం

Maharashtra: మహారాష్ట్రలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. భండారా జిల్లాలోని ఓ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉదయం 10.30 గంటల సమయంలో ఇది చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ సంజయ్‌ కోల్తే వెల్లడించారు. పేలుడు తీవ్రతకు ఫ్యాక్టరీ పైకప్పు కూలిపోయింది.

ఈ శబ్దం 5 కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరిని కాపాడినట్లు సమాచారం. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఒకరి మృతిని అధికారులు ధ్రువీకరించారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button