Konda Surekha: విరాట్ కోహ్లీని గుర్తు చేస్తూ కేసీఆర్పై విమర్శలు

Konda Surekha: విరాట్ కోహ్లీ గురించి పొగుడుతూ కేసీఆర్పై విమర్శలు చేశారు మంత్రి కొండా సురేఖ. భారత్ పాకిస్తాన్ మ్యాచులో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే దీనిపై స్పందించారు మంత్రి కొండా సురేఖ. విరాట్ కోహ్లీ తిరిగి ఫాంలోకి వచ్చి సెంచరీ చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో 51వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 14వేల పరుగులు సైతం పూర్తి చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడన్నారు. అయితే విరాట్ కోహ్లీ లాగా కేసీఆర్ కూడా సరికొత్త రికార్డు నెలకొల్పాడని సెటైర్లు వేశారు.
దాదాపు 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకుండా కేసీఆర్ కొత్త రికార్డ్ సాధించారని విమర్శించారు. ప్రజాసమస్యలపై స్పందించకుండా ప్రజలకి అందుబాటులో లేకుండా దేశ రాజకీయ చరిత్రలో ఇదొక పెద్ద రికార్డ్ అన్నారు. 14 వేల రన్నులు చేసిన కోహ్లీ ఓవైపు వార్తల్లో నిలిస్తే 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని కేసీఆర్ కూడా వార్తల్లోకి ఎక్కడం ఆలోచించాల్సిన విషయం కాదా? అని ట్వీట్లో పేర్కొన్నారు.