జాతియం
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం.. ఖర్గే అధ్యక్షతన భేటీ

CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన భేటీ ప్రారంభమైంది. సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్తోపాటు సల్మాన్ ఖుర్షిద్, అంబికా సోనీ సహా ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పహల్గామ్ ఉగ్రదాడిని సీడబ్ల్యూసీ ఖండించింది. ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపింది. అదేవిధంగా పలు అంశాలపై చర్చిస్తున్నారు.