ఆంధ్ర ప్రదేశ్
Srikakulam: ట్రైన్, పట్టాల మధ్య ఇరుక్కుపోయిన యువకుడు

Srikakulam: ట్రైన్, ప్లాట్ఫామ్కు మధ్య ఇరుక్కుపోయి ఓ యువకుడు నరకయాతన అనుభవించాడు. ఫుట్ బోర్డు నుంచి కాలు జారిపడడంతో.. ప్లాట్ఫారమ్, కోణార్క్ రైలు భోగి మధ్య ఇరుక్కుపోయాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది.
ప్రమాదాన్ని గమనించిన రైల్వే అధికారులు వెంటనే స్పందించి.. యువకుడిని రక్షించారు. స్వల్పగాయాలైన క్షతగాత్రుడిని.. రైల్వే ఆస్పత్రి వైద్యులు ప్రథమ చికిత్స అందించారు.