తెలంగాణ

Raja Singh: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచల వ్యాఖ్యలు

Raja Singh: మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సొంత పార్టీ అయిన బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. తొందర్లోనే తెలంగాణకు కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడని వెల్లడించాడు రాజాసింగ్. అయితే అధ్యక్షుడిని ఫైనల్ చేసేది స్టేట్ కమిటీనా? లేక సెంటర్ కమిటీనా అనేదానిపై క్లారిటీ ఇవ్వలేదన్నారు.

కొందరు అధ్యక్షుడు కాగానే వారి గ్రూప్ తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారని అన్నారు. పార్టీ కోసం జైలుకెళ్లిన కార్యకర్తలను పక్కన పెట్టారని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. గతంలో పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ అధికారులు తొక్కిపెట్టారని అన్నారు. కార్యకర్తల మనసులో ఉన్న మాటనే తాను చెబుతున్నట్టు రాజాసింగ్ చెప్పారు. సమస్యను పెద్దల దృష్టికి తీసుకెళ్లినా వాళ్లు వినకపోతే ప్రజల ముందు పెడుతున్నానని చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button