ఆంధ్ర ప్రదేశ్
గుంటూరు మిర్చియార్డు వద్ద రైతుల ఆందోళన

Guntur: గుంటూరు మిర్చియార్డు వద్ద రైతులు ఆందోళన బాట పట్టారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మిర్చికి గిట్టుబాటు ధరలు కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నా రు. మిర్చియార్డు ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మిర్చికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చిని రోడ్డుపై వేసి నిరసన తెలుపుతున్నారు. మిర్చికి మద్దతు ధర 20వేల రూపాయలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.