ఆంధ్ర ప్రదేశ్

Nara Bhuvaneshwari: సమాజం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుంది

Nara Bhuvaneshwari: సమాజానికి ఎలాంటి అవసరం వచ్చినా సేవాభావంతో పనిచేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని మేనేజింగ్ ట్రస్టీ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. 28ఏళ్లుగా నిత్యం ఆపన్నుల సేవలో కొనసాగుతున్నామని తెలిపారు. ప్రజలకు ఏం చెప్పామో అది చేసి చూపడమే తమ ట్రస్ట్ లక్ష్యం అని పేర్కొన్నారు.

రక్తదానంతో పాటు తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులను ఆదుకునే లక్ష్యంతో సేవలు అందిస్తామని తెలిపారు. అత్యవసర వైద్య సేవకు నిరంతరం అందుబాటులో ఉంటామని నారా భువనేశ్వరి వివరించారు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే దాతృత్వం చాటుకునే వ్యక్తులు తమతో చేతులు కలపాలని కోరుతున్నామని భువనేశ్వరి వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button