BJP: ఉత్తర తెలంగాణలో ఓకే.. మరి దక్షిణ తెలంగాణలో బీజేపీ పరిస్థితి?

BJP: తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మూడు సీట్లకు గాను రెండు సీట్లను కాషాయ పార్టీ గెలుచుకుంది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారం తమదే అంటున్నారు కమలం నేతలు. ఉత్తర తెలంగాణలో పార్టీ గణనీయంగా పుంజుకుందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నకల్లో అధికారంలోకి రావాలంటే కేవలం ఉత్తర తెలంగాణలో బలంగా ఉంటే సరిపోతుందా మరి దక్షిణ తెలంగాణలో పార్టీ పరిస్థితి ఏంటి.. తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ….
తెలంగాణలో బీజేపీ పార్టీ బలపడేందుకు ముందు నుండి ఒక ప్రణాళిక ప్రకారం వ్యూహాత్మకంగా ముందుకు వెల్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో 8 సీట్లు వచ్చినా పార్లమెంటు ఎన్నికల నాటికి పుంజుకొని రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ తో ఢీ అంటే ఢీ అని కాంగ్రెస్ తో సమానంగా 8 ఎంపీ సీట్లను గెల్చుకొని అందర్ని ఆశ్చర్యపరిచింది. అయితే ఇతర ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాల ప్రభావం ఉండదని కాంగ్రెస్, బీఆర్ఎస్ బీజేపీని విమర్శించాయి. కానీ, తాజా మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు బీజేపీకి అండగా నిలవడంతో కమల పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు.
పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించామని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని అనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అన్న చర్చ జరుగుతోందట బీజేపీ వర్గాల్లో. తమ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ మీద మరింత దృష్టి పెడుతున్నందున అడపాదడపా ఉన్న అసంతృప్తులు కూడా సెట్ అయిపోయి పార్టీ గాడిన పడుతుందని ఆశాభావంతో ఉన్నారట.
బీజేపీ గెలిచిన మొత్తం 8 ఎమ్మెల్యే సీట్లో 7 ఉత్తర తెలంగాణ నుంచే ( కామారెడ్డి, నిర్మల్, సిర్పూర్, ముథోల్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిజామాబాద్) సొంతం చేసుకుంది. నాలుగు ఎంపీ సీట్లు (మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్) కూడా ఉత్తర తెలంగాణ నుండే కావడంతో ఉత్తర తెలంగాణలో పార్టీ బలంగా ఉందని నేతలు అంటున్నారు.
మరి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో బీజేపీ బలంగా లేదనే వాదన ఉంది. ఖమ్మం, నల్గొండ లాంటి ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పరిస్థితి బాగోలేదని రాజకీయ విశ్లేశకుల మాట. మరి 2028లో తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని అంటున్న కమలం పార్టీ నేతలు ముందుగా దక్షిణ తెలంగాణపై ద్రుష్టి పెట్టాలని కొందరు బీజేపీ అభిమానులు అంటున్నారట.
రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే తెలంగాణ వ్యాప్తంగా బలంగా ఉండాలని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకంటే బలంగా క్షేత్ర స్థాయిలో పుంజుకోవాలసిన అవసరం ఉంటుంది. అంతే కానీ క్షేత్రస్థాయిలో బలపడకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అవుతాయని కింది స్థాయి కార్యకర్తలు కోరుకుంటున్నారట.