Kash Patel: అమెరికన్లకు హాని చేయాలని చూస్తే అంతు చూస్తా

Kash Patel: అమెరికా దర్యాప్తు సంస్థ FBI డైరెక్టర్గా భారతీయ సంతతి వ్యక్తి కాశ్ పటేల్ నియామక ప్రక్రియ పూర్తి అయ్యింది. కాశ్ పటేల్ను ఆ పోస్టుకు సేనేట్ కన్ఫర్మ్ చేసింది. 51-49 ఓట్ల తేడాతో ఆయన నియామకం జరిగింది. ఎఫ్బీఐ డైరెక్టర్ పదవి చేపట్టిన తొలి హిందూ, భారతీయ అమెరికన్గా కాశ్ పటేల్ నిలిచారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు.
ఎఫ్బీఐ డైరెక్టర్గా నియమించడం పట్ల కాశ్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. ఎక్స్ అకౌంట్లో అధ్యక్షుడు ట్రంప్కు ఆయన థ్యాంక్స్ తెలిపారు. ఎఫ్బీఐ దర్యాప్తు ఏజెన్సీ పారదర్శకత, బాధ్యత, న్యాయానికి మారు పేరని.. ఆ సంస్థను పునర్ నిర్మించనున్నట్లు తన పోస్టులో కాశ్ పటేల్ తెలిపారు.
ఎఫ్బీఐ డైరెక్టర్గా కాశ్ పటేల్ను ఆమోదించేందుకు సెనేట్ ఓటింగ్ నిర్వహించింది. అనుకూలంగా 51 ఓట్లు రాగా, 49మంది వ్యతిరేకించారు. అయితే 49మందిలో ఇద్దరు రిపబ్లికన్ సనేటర్లు కూడా ఉన్నారు. ఇక ప్రతిపక్ష డెమొక్రట్లు కూడా కాశ్ నియమాకంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు ఓట్ల తేడాతో కాశ్ నియామకం జరిగింది.
అధ్యక్షుడు ట్రంప్నకు విధేయుడిగా కాశ్కు పేరుంది. పటేల్ కుటుంబ మూలాలు గుజరాత్లో ఉన్నాయి. ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాలో పెరిగారు. తండ్రి ఉగాండాలో నియంత. ఈదీ ఆమిన్ బెదిరింపుల కారణంగా అమెరికాకు వలస వచ్చారు. 1980లో న్యూయార్క్లోని గార్డెన్ సిటీలో పటేల్ జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ రిచ్మాండ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూనివర్శిటీ కాలేజ్ లండన్లో న్యాయవిద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఓ లా సంస్థలో పని చేయాలనుకున్నా కొలువు లభించలేదు. దీంతో మియామీ కోర్టుల్లో పబ్లిక్ డిఫెండర్గా పనిచేసి వివిధ హోదాల్లో సేవలందించారు.