తెలంగాణ
వేములవాడలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం

Vemulawada: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజులపాటు ప్రతిరోజు శ్రీ స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషద్ ద్వారా అభిషేకాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.