ఆంధ్ర ప్రదేశ్
టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్యోగుల ఆందోళన

టీటీడీ పరిపాలన భవనం వద్ద ఉద్యోగులు ఆందోళనకు దిగారు. బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మొన్న విధుల్లో ఉన్న ఉద్యోగిపై నరేష్ కుమార్ దుర్భాషలాడారు. దీనిని ఖండిస్తూ నిరసనకు పిలుపునిచ్చారు ఉద్యోగులు.