ఆంధ్ర ప్రదేశ్

Srisailam: ముక్కంటి నాదుడి దర్శనానికి ముక్కోటి తిప్పలు

Srisailam: భూమండలానికి నాభిస్థానం.. ఇలలో కైలాసం.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం… అష్టాదశ శక్తిపీఠం.. శ్రీశైల మల్లన్న క్షేత్రం. ఈ మహాక్షేత్రానికి సదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ మీనామేశాలు లెక్కిస్తుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులపై దృష్టి సారించడం లేదు. ప్రతి ఏటా వీఐపీల సేవలోనే దేవాదాయ శాఖ తరిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయ్. దీంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని స్వామిదర్శనం చేసుకోకుండానే… శివ శివ అంటూ తిరుగు ప్రయాణం అవుతున్నారు.

శ్రీశైలం క్షేత్రంలో భక్తులకు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోట్లలో ఆలయ ఆదాయం ఉన్నప్పటికీ.. శాశ్వత క్యూలైన్లు ఏర్పాటు చేయడంలో మాత్రం దేవాదాయ శాఖ నిర్లక్ష్యం వహిస్తుంది. ఎంతో వ్యయ ప్రయాసలతో మల్లన్న క్షేత్రానికి చేరుకున్న శివ భక్తులకు శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముక్కంటి నాదుడి దర్శనానికి వచ్చిన భక్తులకు కోటి తిప్పలు తప్పడం లేదు.

శ్రీశైల దేవస్థానంలో క్యూ లైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీంతో… మల్లన్న దర్శనార్థం వచ్చే భక్తులు అవస్థలు పడాల్సి వస్తోంది. మాఘమాసం కావడంతో శ్రీగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, అంతేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. సర్వదర్శనానికి 3నుంచి 4 గంటల సమయం పడుతుంది.

అయితే సర్వదర్శనం చేసుకోవాలనే భక్తులు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాల్సి వస్తుంది. ఇనుప రేకులతో వేసిన షెడ్లు కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడి ఉక్కపోతతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు సంకట పరిస్థితులు ఎదుర్కొన్నారు.

వచ్చే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు దేవాదాయ శాఖ సామాన్య భక్తులపై దృష్టి సాధించాలని భక్తుల కోరుతున్నారు. ఐరన్ గ్రిల్స్ తో ఏర్పాటు చేసిన క్యూలైన్లు ప్రమాదకంగా మారాయని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా చిన్న పొరపాటుతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరుగుతే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button