ఆంధ్ర ప్రదేశ్
Gorantla Madhav: నేడు విజయవాడ పోలీసుల విచారణకు గోరంట్ల మాధవ్

Gorantla Madhav: నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణకు హాజరుకానున్నారు. గతేడాది నవంబర్ 2 మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసారు. నిన్న విచారణకు హాజరు కావాలని గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వగా అనంతపురం నుంచి బయల్దేరినప్పటికీ గైర్హాజరయ్యారు.
నేడు విచారణకు హాజరు అవుతానని పోలీసులు సమాచారం ఇచ్చారు మాధవ్. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరుకానున్నారు. పోక్సో కేసులో గోరంట్ల మాధవ్ బాధితురాలి పేరు బయటపెట్టాడని మాజీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది.