తెలంగాణ
KCR: ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం నల్లగొండ జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం

KCR: గులాబీబాస్ కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఉమ్మడి మహబూబ్ నగర్ పార్టీ ముఖ్యనేతలు, ఖమ్మం, నల్గొండ జిల్లా ముఖ్య నేతలు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో సమావేశం జరిగింది. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా సభ ఏర్పాట్లు పలు అంశాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.