తెలంగాణ
Harish Rao: బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

Harish Rao: సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం చంద్లపూర్ లోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ను బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. రంగనాయక సాగర్ లోకి నీటిని విడుదల చేసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తుడిచి పెట్టాలని చూస్తుంది అని ఆరోపించారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీరు తగ్గిన కాళేశ్వరం ద్వారా రెండు పంటలకు సాగునీరు విడుదల చేశాం అన్నారు. ఇక, మేడిగడ్డలోని ఒక్క బ్లాక్ లో ఒక పిల్లర్ మాత్రమే కుంగితే మాపై బురద జల్లి అధికారంలోకి వచ్చారు అని హరీష్ రావు విమర్శించారు. మేడిగడ్డలోని ఒక్క బ్లాక్లోని ఒక పిల్లర్ మాత్రమే కుంగితే బీఆర్ఎస్ పై బురద జల్లి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన మండిపడ్డారు.