Allu Arjun: అల్లు అర్జున్ భారీ ప్రాజెక్ట్ AA22.. ముంబైలో సైలెంట్ లాంచ్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో అతిపెద్ద చిత్రం AA22 ప్రారంభమైంది. ముంబైలో సైలెంట్గా జరిగిన పూజా కార్యక్రమంతో ఈ భారీ ప్రాజెక్ట్ శ్రీకారం చుట్టింది. దీంతో సినీ ప్రియుల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్జున్ ఖాతాలో మరో సంచలనం సృష్టించేందుకు AA22 సిద్ధమవుతోంది. ముంబైలో నిరాడంబరంగా జరిగిన పూజా కార్యక్రమంలో కేవలం సన్నిహిత బృందం మాత్రమే పాల్గొంది. బయటి వ్యక్తులను ఆహ్వానించకుండా, సీక్రెట్గా ఈ వేడుకను పూర్తి చేశారు. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం, అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ నిపుణులతో రూపొందుతోంది.
ముంబైతో పాటు విదేశాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. షూటింగ్ను కూడా గోప్యంగా నిర్వహించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. అల్లు అర్జున్ ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లే ఈ ప్రాజెక్ట్, అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. సినిమా వివరాల కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.