ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి జిల్లాలో ఏనుగుల హల్చల్.. భయం గుప్పిట్లో గ్రామస్తులు

తిరుపతి జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేస్తున్నాయి. చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, పాకాల, యర్రావారిపాళెం మండలాల్లో ఏనుగులు తిష్ట వేసాయి. ఏనుగులు వరుసగా దాడులు చేస్తూ వరి, బొప్పాయి, మామిడి, టమోటా, అరటి పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. రాత్రి పాకాల మండలం గానుగపెంట గ్రామంపై గజరాజులు బీభత్సం సృష్టించాయి.
గ్రామం పక్కనే తిష్ట వేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రాత్రంతా భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నామంటున్నారు. అలాగే రెండు రోజుల క్రితం చిన్నగొట్టిగల్లు మండలం దాసరిగూడెంకు చెందిన రైతు సిద్దయ్యను తొక్కి చంపింది ఏనుగు. దీంతో ఏనుగుల దాడి నుంచి పంటలను, ప్రాణాలను రక్షించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు.