ఆంధ్ర ప్రదేశ్
Maddila Gurumoorthy: ఏపీలో రెడు బుక్ రాజ్యాంగం నడుస్తుంది

Maddila Gurumoorthy: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి . దీనికి నిదర్శనం జిల్లాలో ప్రజల సమస్యలపై మాట్లాడే కాకాని గోవర్ధన్ రెడ్డి పై అక్రమ కేసులు బనాయించడమే అన్నారు. తిరుపతి జిల్లాల్లో ఎక్కడ చూసినా అక్రమ మైనింగ్ చేస్తూ వైసిపి నాయకులు చేస్తున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు వెళ్తామన్న తమ పార్టీ ఎమ్మెల్సీను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. గతంతో పోలిస్తే మైనింగ్ పరిశ్రమతో వచ్చే ఆదాయం ఇప్పడు పూర్తిగా ఆగిపోయిందన్నారు.