ఆంధ్ర ప్రదేశ్
KIA: కియా పరిశ్రమలో 900 కారు ఇంజిన్లు మాయం

KIA: సత్యసాయి జిల్లా పెనుకొండలో భారీ చోరీ జరిగింది. కియా పరిశ్రమలో ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మార్చి 19న పోలీసులకు కియా యాజమాన్యం ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు చోరీ విషయాన్ని సత్యసాయి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు కియా సీఈవో.
దీంతో సిట్ విచారణ చేసి దర్యాప్తు చేస్తామని ఎస్పీ చెప్పినట్లు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇప్పుడు ఏపీలో హాట్ టాఫిక్గా మారింది. ఇక చోరీ పరిశ్రమలో జరిగిందా? లేక ఇంజిన్ల ట్రాన్స్పోర్టు సమయంలో జరి గిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.