హెచ్సీఏపై ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు

హెచ్సీఏపై ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. ఫ్రీ టికెట్స్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోందని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆరోపించింది. అధ్యక్షుడు జగన్మోహనరావు పలుమార్లు బెదిరించారని ఇలాగైతే తాము హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని సన్రైజర్స్ హైదరాబాద్ హెచ్చరించింది. HCA ట్రెజరర్ కు SRH మేనేజర్ లేఖ రాశారు.
ఒప్పందం ప్రకారం హెచ్సీఏకు సన్రైజర్స్ 10 శాతం ప్రకారం 3వేల 900 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తోంది. కోరినన్ని పాస్లు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్కు తాళాలు వేసిన విషయాన్ని లేఖ ద్వారా సన్రైజర్స్ బయటపెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని తెలిపింది. మ్యాచ్ మొదలవబోతుండగా ఇలా బ్లాక్మెయిల్ చేయడం అన్యాయమని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టమని పేర్కొంది.
బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామని పేర్కొంది. 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పని చేస్తున్నామని, గత రెండేళ్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయంది. ఈ సమస్య పరిష్కారానికి హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాట్లు చేయాలని ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ లేఖలో పేర్కొన్నారు.