ఆంధ్ర ప్రదేశ్
YS Sunitha Reddy: వివేకా హత్య కేసులో న్యాయం జరగలేదు.. వైఎస్ సునీతా సంచలన కామెంట్స్

YS Sunitha Reddy: వైఎస్ వివేకను హత్య చేసి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదని వివేకా కుమార్తె వైఎస్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. కానీ న్యాయం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి సందర్భంగా కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి నివాళులర్పించారు. పులివెందుల్లోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి సునీత, కుటుంబసభ్యులు నిబవాళులర్పించారు.
తమ తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయ్యిందన్నారు. న్యాయం కోసం ఆరు సంవత్స రాలుగా పోరాడుతున్నట్లు తెలిపారు. హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన అందరూ బయట యధేచ్చగా తిరుగుతున్నారని ఆరోపించారు. సీబీఐ వాళ్ళు మళ్లీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారని నమ్మకం ఉందన్నారామె.