తెలంగాణ
Harish Rao: రైతులను నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్దే

Harish Rao: రైతులకు యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ పాలనపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్ పునరావృతం చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి, నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.