తెలంగాణ
Revanth Reddy: ప్రధాని మోడీపై యుద్ధానికి సిద్దమవ్వాలి

Revanth Reddy: ప్రధాని మోడీపై యుద్ధానికి సిద్దమవ్వాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. యూత్ కాంగ్రెస్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న సీఎం దేశంలో కులగణన చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబడదాం అన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడం కాదని.. రీజనల్ రింగ్ రోడ్ ఏమైందో చెప్పాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి బుగ్గ కార్లలో తిరగడం తప్ప.. నిధులు తేవడంలో ఫెయిల్ అయ్యారని విమర్శలు చేశారు. అనంతరం ప్రధాని మోడీపై యుద్ధానికి యూత్ కాంగ్రెస్ నేతలతో కలిసి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.