తెలంగాణ
హైదరాబాద్లో మరోసారి హైడ్రా దూకుడు.. కూకట్పల్లిలో ఆక్రమణలు కూల్చివేత

హైదరాబాద్లో మరోసారి హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారి భరతం పడుతోంది. కూకట్పల్లిలో ఆక్రమణలను కూల్చివేసింది. ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఆర్మీ ఉద్యోగికి కేటాయించిన భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టి భూమి ఆక్రమణ చేశారని నిర్ధారించారు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. జేసీబీతో ఆక్రమణలను కూల్చి, 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు.