ఆంధ్ర ప్రదేశ్
IT Raids: కాకినాడ జిల్లాలో ఐటీ అధికారుల దాడుల కలకలం

IT Raids: కాకినాడ జిల్లాలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతున్నాయి. సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ సంబంధించిన మేనేజర్ అశోక్ ఇంట్లో అధికారులు తనీఖీలు చేస్తున్నారు. అలాగే.. సంస్థ కార్యాలయం రాయ్పూర్లోనూ తనిఖీలు జరగుతున్నట్లు సమాచారం. ఉదయం నుంచి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
గత ఐదు సంవత్సరాల కాలంలో కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారన్న ఆరోపణలతో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో షిప్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిన నౌకలో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని సత్యం బాలాజీ సంస్థ ఎగుమతి చేస్తున్నట్టుగా ఆధారాలు దొరికాయి. ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.