ఆంధ్ర ప్రదేశ్
Kadapa: మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం.. కాల్వలో జారిపడ్డ మహిళ

Kadapa: కడప జిల్లా బద్వేల్లో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణం మీదకొచ్చింది. పట్టణంలోని ముంబై కేఫ్ ముందు ఉన్న కాల్వలో మహిళ జారిపడింది. అధికారులు డ్రైనేజ్ పూడికతీసి వదిలేశారు.
పనులు పూర్తి చేసి 2నెలలు గడుస్తున్న అధికారులు కాల్వ పైకప్పు వేయకపోవడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది. కప్పు వేయకపోవడంతోనే మహిళ కాల్వలో పడిందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.