
Revanth Reddy: 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను గుర్తించి డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటును గత యూపీఏ ప్రభుత్వం ప్రకటించిందని సీఎం రేవంత్ అన్నారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం రోజున తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.



