తెలంగాణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు… రెండో రోజు జోరుగా నామినేషన్లు

తెలంగాణలో జోరుగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నేటితో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దీంతో అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేయనున్నారు.ఇప్పటివరకు సర్పంచ్ పదవులకు 8వేల198 నామినేషన్లు దాఖలు కాగా వార్డులకు 11వేల 502 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
రేపు నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం ద్వారా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. నామినేషన్ల స్క్రూటిని పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు.



