సినిమా
Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్..

Janhvi Kapoor: నటి జాన్వీ కపూర్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. శుక్రవారం నాడు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఆమె తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.