ఆంధ్ర ప్రదేశ్
Jogi Ramesh: నకిలీ మద్యం కేసు.. జోగి రమేష్ కు రిమాండ్ పొడిగింపు

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు రిమాండ్ పొడిగించింది కోర్టు. నేటితో ఆయనకు విధించిన రిమాండ్ పూర్తి కావడంతో ఎక్సైజ్ పోలీసులు ఆయనను విజయవాడ కోర్టులో హాజరపరిచారు.
ఆయనతో పాటు ఇతర నిందితులైన జోగి రాము, అద్దెపల్లి జనార్దన్ రావు, మరో నలుగురిని కోర్టుకు తీసుకువచ్చారు. రిమాండ్ గడువు పెంచాలని అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు వారికి డిసెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది.



